విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజ్భవన్లో “ఎట్ హోం” కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. రాజ్భవన్ ఆవరణ లో ఏర్పాటు చేసిన వేదికగా సాయంత్రం ఈ కార్యక్రమం కొనసాగింది. ఆహ్వానితులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనీటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన సతీమణి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామోహన్, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కలెక్టర్ జి.లక్ష్మీశ, ఇతర క్రీడాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు.