రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు.
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ నిధులు
![](https://suryaa.co.in/wp-content/uploads/2024/06/modi-.jpg)