Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోంది. రాజమండ్రి రామాలయం సెంటర్ లో రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిఎ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణకుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి చట్టవిరుద్ధంగా ఇలా దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరు? తమకు అన్యాయం జరిగినపుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ పౌరులకు కల్పించారు. అరాచకశక్తుల మాయలోపడి చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రశేఖర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంధి.

LEAVE A RESPONSE