ఏపీలో పోలీసులు అధికార వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు

అనంతపురం జిల్లా యాడికికి చెందిన ఆరుమంది బీసీ యువకులపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన తాడిపత్రి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవహక్కుల కమీషన్ కు లేఖ రాసిన తెదేపా నేత వర్లరామయ్య

• ఏపీలో పోలీసులు అధికార వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు.
• అసమ్మతి స్వరాలను అణచివేస్తున్నారు.
• ఒక వర్గం పోలీసులు రాక్షసంగా మారి ప్రతిపక్షాలను అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు, చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
• అనంతపురం జిల్లా యాడికి చెందిన ఆరుమంది బీసీ యువకులపై తాడిపత్రి పోలీసులు కస్టడీయల్ టార్చర్ కు పాల్పడ్డారు.
• అధికార పార్టీ మద్దతుదారులు బీసీ వర్గానికి చెందిన స్థానిక యానిమేటర్‌ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు.
• దీంతో అధికార పార్టీ అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.
• కానీ, వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు ఒక మహిళతో పాటు ఆరుమంది బీసీ యువకులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
• యాడికి పోలీసులు గుజ్జల ధనలక్ష్మిని మినహాయించిన మిగిలిన వారిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు.
• తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఫైబర్ లాఠీలతో బాధితులను చితకబాదారు. స్లాబ్ రాయిపై చేతి వేళ్లు పెట్టమని లాఠీతో వేళ్లపై కొట్టారు.
• బాధితులను కస్టడియల్ టార్చర్‌కు గురిచేసి వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోండి.
• రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలపై కమీషన్ కు అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసినా పోలీసుల పనితీరులో ఎటువంటి మార్పు లేదు.

Leave a Reply