Suryaa.co.in

National

ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్

ఢిల్లీ: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసుల సమాచారం… దీంతో ఉగ్రవాదులు భారీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలిం గ్, తనిఖీలను పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాయి.విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించు కునేలా ఉగ్రవాదులు వ్యూహాలు సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

కొన్ని ఉగ్రముఠాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టిం గ్ లు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని నిఘా విభాగం తెలిపింది. కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. రద్దీ ప్రాంతాలతోపాటు ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

LEAVE A RESPONSE