Suryaa.co.in

Telangana

కొండా నివాసంలో ప్రజాదర్బార్

హన్మకొండలోని రాంనగర్ లోని తన నివాసంలో మంత్రివర్యులు కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  సిటీలోని క్యాంప్ ఆఫీసులో వందలాదిగా వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి సాధ్యమైనంత వరకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు.

కాగా మంత్రి నివాసంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే పరమావధిగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, తాను హైదరాబాద్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో వుండాలని, వీలైన వారు తనను హైదరాబాద్ లో కలవాలని మంత్రి సురేఖ సూచించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలోనూ, హైదరాబాద్ సెక్రటేరియట్ కార్యాలయంలోనూ తాను అందుబాటులో ఉంటానని మంత్రి సురేఖ ప్రజలకు తెలిపారు.

LEAVE A RESPONSE