Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్…

సమస్యల పరిష్కారానికై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా
ఎమ్మెల్యే సత్యానందరావు

ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం మార్గం చూపేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు.నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో 403 వినతులు వచ్చాయని తెలిపారు.సమస్యలను బట్టి వాటి పరిష్కార సమయం ఉంటుందని అన్నారు.ప్రజలు ఇచ్చిన సమస్యల వినతులు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సత్యానందరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు, కంఠంశెట్టి శ్రీనివాస్,పాలూరి సత్యానందం,ముత్యాల బాబ్జి,యల్లమెల్లి జగన్మోహన్,రెడ్డి రామకృష్ణ,కంఠంశెట్టి చంటి,బీర ఇస్సాక్,రెడ్డి తాతాజీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE