Suryaa.co.in

Telangana

కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి

– మంత్రి సీతక్క

హైదరాబాద్: తెలంగాణలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి, కొత్త ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE