– సంజయ్ను నోటిని ఫినాయిల్తో కడగాలి
– మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: రాజ్భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్భవన్ గేటు ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ తమిళిసైని కలవడానికి మేయర్ బృందం ప్రయత్నించగా, గవర్నర్ అపాయింట్మెంట్ లేదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి.
అపాయింట్మెంట్ అడిగినా గవర్నర్ స్పందించలేదని.. ఆమెను కలిసే వరకూ ఇక్కడే ఉంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తేల్చి చెప్పారు. బండి సంజయ్.. మహిళలను అవమానించారని మేయర్ మండిపడ్డారు. ‘‘మహిళల పట్ల సంజయ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. సంజయ్ను నోటిని ఫినాయిల్తో కడగాలి. సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. బేషరతుగా మహిళలకు సంజయ్ క్షమాపణలు చెప్పాలని మేయర్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు.