Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు: సోమువీర్రాజు పిలుపు

విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా ఇదేమి దుర్మార్ఘపు ప్రభుత్వం… నిభందనల పేరుతో వినాయక చవితి వేడుకులకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతున్న అనుమానాలు బలపడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని సోమువీర్రాజు బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేటి ఉదయం నిర్వహించినటువంటి రాష్ట్ర బిజెపి పదాధికారులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీల ఇన్చార్జిల యొక్క ఫోన్ కాన్ఫరెన్స్లో రేపు రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండగలకు సంబంధించి పందిళ్ళ అనుమతి పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తాసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని నిరసన నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమాలు ఆందోళన తర్వాత తాసిల్దారులకు వినతుల్ని సమర్పించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.

వినాయక చవితి ఉత్సవాలకు మంటపాలు పందిళ్లు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపునిచ్చింది
హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి పండుగను నిబంధనలు పేరుతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో వీధుల్లో వాడల్లో జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైసిపి ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.
ఆంక్షలు పెట్టడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులను నిరుత్సాహపరచి, మంటపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలనే కుట్ర జరుపుతోందని సోము వీర్రాజు తీవ్రంగా దుయ్యపట్టారు.

ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని కుట్రపూరితంగా రాష్ట్ర డిజిపి ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను ఉత్సవ సమితి సభ్యులను వివిధ రకాలుగా వేధిస్తూ వారి మనసులను బాధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని, వినాయక చవితి పందిళ్లకు పోలీసు శాఖ నుండి మైక్ అనుమతి మినహా మరి ఏ ఇతర అనుమతులను తీసుకోవాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు.

వినాయక చవితి ఉత్సవాలను దరఖాస్తు చేసిన వెంటనే సింగల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర బిజెపి డిమాండ్ చేస్తుందని సోమ వీర్రాజు ప్రకటించారు ఇలా కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.

LEAVE A RESPONSE