Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజలకు , భారత ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి

-మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయింది
-ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి రెండడుగుల -దూరంలో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు విగ్రహం మొహం చూడడానికి కూడా రాహుల్ ఇష్టపడలేదు 
-మీది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర
-చార్మినార్ దగ్గరకు వెళ్లిన రాహుల్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదు
-తెలంగాణలో యాత్ర ముగిసేలోపే రాహుల్ క్షమాపణ చెప్పాలి
-తీవ్రంగా దుయ్యబట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు , ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్ ; హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ పక్కనే రెండడుగుల దూరంలో ఉన్న మాజీ ప్రధానీ , కాంగ్రెస్ నాయకుడే అయిన పీవీ నర్సింహరావు విగ్రహం వైపు మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూడలేదు . తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మెప్పు కోసం చేసిన నాటకమా ఇది సమాధానం చెప్పాలి.

తెలంగాణ ప్రజలను , భారతదేశ ఆర్ధిక పరిస్థితిని గతిని మార్చిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశానికి ప్రధాని గా పని చేసిన పీవీ నర్సింహారావు విగ్రహానికి ఎందుకు నివాళుర్పించలేదో వెంటనే సమాధానం చెప్పాలి దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

మీ కుటుంబానికి బానిసలుగా ఉన్న వారికి మాత్రమే విలువ ఉంటుందని మరోసారి రుజువయ్యింది. ప్రధానిగా చేసిన పీవీ నర్సింహరావుకు ఢిల్లీలో ఘాట్ ఇవ్వకుండా అంతిమసంస్కారాలు కూడా ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ పంపించి ఆనాడు అవమానించారు. ఈనాడు పీవీ విగ్రహానికి నివాళులు అర్పించ కుండా అవమానించారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. కొత్త కాంగ్రెస్ అద్యక్షుడు పీవీ నర్సింహరావు తో కలిసి పనిచేసిన మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు .

చార్మినార్ దగ్గరకు వెళ్లి మాట్లాడిన రాహుల్ గాంధీ పక్కనే ఉన్న చరిత్రాత్మకమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకపోవడమేంటని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది భారత్ జోడో యాత్రనా లేక భారత్ తోడో యాత్ర నా అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మీ నాయకత్వమే కదా భారత్ ను మత ప్రాతిపదికన పాకిస్థాన్ గా విడగొట్టి , కశ్మీర్ ను ఆగం చేసింది మరోసారి దేశాన్ని విభజించే కుట్ర మీ యాత్ర ద్వారా సాగుతున్నదని మండిపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ యాత్రకు పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుందని తెలంగాణలో కాంగ్రెస్ , తెరాస పార్టీ ల జోడో యాత్ర సాగిన విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధమవుతున్నది డాక్టర్ లక్ష్మణ్ అన్నారు . రాహుల్ గాంధీ చేస్తోన్న యాత్రతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు భయటపడిందని , యాత్ర ద్వారా ప్రయాస తప్ప ప్రజల మద్దతు లభించదని డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు .

LEAVE A RESPONSE