Home » జగన్ .. నీది అజ్ఞానమా?దురంహకారమా?

జగన్ .. నీది అజ్ఞానమా?దురంహకారమా?

-ప్రతిపక్ష హోదా ఎందుకిస్తారు?
-ఆ హోదా లేనిదే ప్రజా సమస్యలు చర్చించరా?!
-మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

మంగళగిరి: జగన్మోహన్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాటు కావడం అలవాటైపోయింది. 11 సీట్లు మాత్రమే పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షహోదా కావాలట. ఆ హెోదా ఉంటేనే ప్రజాసమస్యల్ని సమర్థవంతంగా సభలో విన్పించగలరట! అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కి రాసిన లేఖలో జగన్ ఓ వింత వాదన, అసంబద్ధమైన వాదన చేశారు.

అందులో మొదటిది – తనను ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించకుండా.. మంత్రుల తర్వాత ప్రమాణం చేయించడం అప్రజాస్వామికం అట!

అసలు – జగన్ తనను తన పార్టీ శాసనసభ్యులు 10 మంది కలిసి నాయకుడిగా ఎన్నుకొన్నట్లు ప్రోటెమ్ స్పీకర్ కు లేఖ ఇవ్వాలి కదా? ఆ లేఖ ఇవ్వనప్పుడు మిమ్మల్ని వైఎస్సార్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడని ప్రోటెమ్ స్పీకర్ ఎలా గుర్తిస్తారు?

మీరు అధికారికంగా లేఖ ఇవ్వనప్పటికీ.. గతంలో మీరు సీఎం పదవి నిర్వహించారు కనుక మిమ్మల్ని మంత్రుల తర్వాత పిలిచారు. నిజానికి, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన గౌరవం.

ఇక, రెండోది – ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలనే నిబంధన లేదు అని పేర్కొన్నారు. కానీ, 10% సీట్లు రాకున్నా.. ప్రధాన ప్రతిపక్షమోూదా ఇవ్వాలనే రూల్గానీ, నిబంధన గానీ ఉన్నదా? ఉంటే దానిని ఎందుకు మీరు మీ లేఖలో ఉదహరించలేదు?

3వది – స్పీకర్ మిమ్మల్ని దుర్భాషలాడారన్నారు. స్పీకర్ కాక ముందు ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల్ని.. ఆయన స్పీకర్ అయిన తర్వాత చేసినట్లుగా మాట్లాడ్డం వాస్తవాల్ని వక్రీకరించినట్లే!

జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నియమాలు పాటించి ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ఉంటే.. ఇపుడు వాటినే అనుసరించేవాళ్లం. ఆయన ఎన్నడూ ప్రజాస్వామ్య సూత్రాలను పాటించలేదు. రూల్స్ ఆఫ్ లా అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు.

జగన్ కి నిజంగా ప్రజల సమస్యలను సభలో సమర్థవంతంగా లేవనెత్తాలంటే.. ఎక్కడ, ఏవిధంగా కూర్చున్నాం.. అన్నది ముఖ్యంకాదు. గతంలో కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు ఎటువంటి హెూదా లేకున్నా.. సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నిర్వహించి.. ఉత్తమ పార్లమెంటేరియన్లుగా గుర్తింపు పొందారు.

బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పగలరా?
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో తలపడి ఓడిపోయిన జగన్ గారు.. తమ సభ్యులను లోక్ సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. కారణం చెప్పగలరా?

మీరు బీజేపీ, కాంగ్రెస్ కి వ్యతిరేకం అయినపుడు తటస్థంగా ఎందుకు ఉండటం లేదు. ప్రజలకు వివరణ ఇవ్వాలి. పార్టీని ప్రైవేటు లిమిటెడ్ గా నడపడం వల్లనే ఓటమి ఎదురయిందని గుర్తించకుండా.. ఇంకా ఆ పద్ధతిలోనే ముందుకు వెళుతున్నారు. దీనిని అజ్ఞానం అనాలా? దురంహకారం అనాలా? చెప్పండి జగన్ రెడ్డి ?

Leave a Reply