Suryaa.co.in

Andhra Pradesh

శరవేగంగా డ్రైనుల్లోని సిల్ట్ తొలగింపు

– మంత్రి నారాయణ

విజయవాడ: డ్రైనుల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని, వరద నీరు బయటకి వెళ్ళేందుకు నున్న రోడ్డు, బై పాస్ రోడ్డు, 100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీ లో సుడిగాలి పర్యటన చేశారు.

వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకొంటూ పర్యటించారు. నిన్నటివరకూ వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుద్ధ్య కార్మికులతో జరుగుతున్న క్లీనింగ్ పనులను పర్యవేక్షించారు. జర్నలిస్టు కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని భారీ మోటార్ లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులు పరిశీలించి, తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో ఏమన్నారంటే… వరద నీరు పోయేందుకు గండ్లు కొట్టిన చోట్ల తాత్కాలికంగా పైప్ లైన్ లు వేయాలని అధికారులకు సూచించాం.

భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టు లు నిర్మిస్తాం. విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయింది. ఆదివారం నాటికి మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయి. వరద నీటితో ఇళ్ళలో చాలా బురద ఉంది. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్ లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నాం. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్నిచోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారు. అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చేయమని అధికారులను అదేశించాం.

LEAVE A RESPONSE