Suryaa.co.in

Telangana

భట్టి సభలో ప్రతిపక్షాలకు అరుదైన గౌరవం

– వేదికపైకి ఆహ్వానించి సభలో మాట్లాడించే అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం

మధిర: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ..ఎన్నికల తర్వాత అభివృద్ధి ప్రధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బలంగా విశ్వసిస్తారు. దీనికి నిదర్శనమే శుక్రవారం మధిర నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించి అరుదైన గౌరవం ఇచ్చారు.

సిపిఐ పార్టీ నుంచి జితేందర్ రెడ్డి, సిపిఎం పార్టీ నుంచి పొన్నం వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ నుంచి ముత్తారం వెంకటి లను వేదిక పైకి ఆహ్వానించడమే కాకుండా వారితో మాట్లాడించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో వారు వ్యవహరించే హుందాతనం, గొప్పతనం గురించి సభలో మాట్లాడుకోవడం విశేషంగా వినిపించింది. ప్రజా స్వామ్య విలువలకు వారిచ్చే గౌరవం గురించి అంతా చర్చించుకున్నారు .. ప్రతిపక్ష పార్టీల నాయకుల సైతం వేదికపైకి ఆహ్వానించి గౌరవించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE