Home » శ్రీవారిని దర్శించుకున్న రేణుకా చౌదరి

శ్రీవారిని దర్శించుకున్న రేణుకా చౌదరి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోవేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రేణుకా చౌదరి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం సేవలందిస్తూనే ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు.

Leave a Reply