– రేవంత్ రెడ్డి అనాధ పిల్లల కు అన్నం పెట్టడం లేదు
– 20 శాతం కమిషన్ ఇచ్చే వాళ్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు
– సిద్దిపేట పట్టణంలోని నాసార్ పుర పిల్టర్ బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో బ్లాంకెట్స్ పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
– విద్యార్థులకు పెట్టే గ్రుడ్లు, బియ్యం ను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు
– గత ప్రభుత్వంలో పాత బియ్యం ఇచ్చాం
– విద్యార్థులతో కలిసి భోజనం చేసిన హరీష్ రావు
సిద్దిపేట: పిల్లలు చలితో చాలా ఇబ్బందులలో ఉన్నారనీ బ్లాంకెట్స్ పంపిణీ చేశాం.5నెలల నుండి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు రావడం లేదు.మెస్ బిల్లులు 5నెలల నుండి రావడం లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండి కూడా అనాధ పిల్లల కు అన్నం పెట్టడం లేదు
రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జోరించిన తక్కువే. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తా అని శపథాలు చేస్తున్నాడు. కమిషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడడం, పార్టీలు మారడం సీట్లు కొనడం రేవంత్ కి అలవాటు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్.
కెసిఆర్ లేకుంటే తెలంగాణ లేదు.
తండ్రి లాంటి కెసిఆర్ ను అలా మాట్లాడాడం సరికాదు.ఫార్మసిటి నీ మేము ఏర్పాటు చేస్తే దానిని ఆయన ఖండించాడు. దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రాష్ట్ర సాధకుడు కేసీఆర్. వీధి రౌడీ లాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.
గ్రీన్ చానెల్ ద్వారా డబ్బులు ఇస్తామని ఇవ్వడం లేదు. 20 శాతం కమిషన్ ఇచ్చే వాళ్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు, కమిషన్ ఇవ్వని వాటికి డబ్బులు ఇవ్వడం లేదు.చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.