Suryaa.co.in

Andhra Pradesh

పింఛ‌ను పీకేసిన 6 ల‌క్ష‌ల మందితో సెల్ఫీ దిగు రిచ్ మోహ‌న్‌!

– యువ‌గ‌ళం పాద‌యాత్ర నుంచి నారా లోకేష్‌

దేశంలోనే రూ.510 కోట్లతో పెత్తందారీ సీఎం రిచ్ మోహ‌న్ రెడ్డి గారూ! నిరుపేద వితంతువుకి ఇచ్చే భ‌రోసా పింఛను తీసేసి ఏం మూట‌క‌ట్టుకుంటావు? ప్ర‌తీ ఇంటికి మేలు చేశామ‌ని, ఆ ఇంటివారితో నిజ‌మైన‌ సెల్ఫీ దిగుతాన‌ని గొప్ప‌గా చెప్పావు క‌దా రిచ్ మోహ‌న్‌. ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం తుగ్గ‌లి మండ‌లం శ‌భాష్‌పురం గ్రామంలో త‌లారి యంక‌మ్మ అనే వితంతువుకి రెండేళ్ల క్రిత‌మే పింఛ‌ను తీసేశావు. భోరున విల‌పిస్తున్న ఆ వితంతువుతో వ‌చ్చి సెల్ఫీ దిగు. ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌నుని, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌గా పేరు మార్చావు. ఎన్నిక‌ల‌కి ముందు 3 వేలుకి పెంచుతామ‌న్న పింఛ‌ను నాలుగేళ్ల‌యినా ఇంకా 3 వేల‌కి చేరలేదు. ఈ లోగానే త‌లారి యంక‌మ్మలాగే రాష్ట్రంలో 6 ల‌క్ష‌ల మంది బ‌తుకుల‌కి భ‌రోసా అయిన పెన్ష‌న్ పీకేశావు.

LEAVE A RESPONSE