Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం..

-ఇద్దరు మహిళా భక్తులు మృతి..

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. శ్రీవారి దర్శనంతరం తిరిగి తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద అదుపు తప్పిన తుఫాన్ వాహనం ఆంజనేయ స్వామి వారిని మొక్కుతున్న మెదక్ కు చేందిన పార్వతమ్మను ఢీ కొని, ప్రక్కనే ఉన్న పిట్ట గోడను ఢీ కొంది.. ఈ ప్రమాదంలో సంఘటన స్ధలంలోనే పార్వతమ్మ మృతి చేందగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి..

ఐతే క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం సహాయంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా రాయదుర్గంకు చేందిన రేణుకమ్మ మృతి చేందింది.. మరో ఐదుగురు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో టిటిడి‌ విజిలెన్స్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు..

LEAVE A RESPONSE