Suryaa.co.in

Andhra Pradesh

రోశయ్య జీవితం మాకు ఒక స్ఫూర్తి:శిద్దా రాఘవరావు

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన శిద్దా రాఘవరావు. సోమవారం హైద్రాబాద్ లోని మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య నివాసంలో వారి కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావు ను కలసి పరామర్శించిన అనంతరం రోశయ్య చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రోశయ్య మరణం తనకు ఆవేదన కలిగించింది అని అన్నారు.నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా,పాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప నాయకుడు
sidda2రోశయ్య అని అన్నారు.ప్రజా జీవితంలో మహోన్నత నేతగా, రాజకీయ విలువలు. పాటిస్తూ అతున్నత పదవులు అలంకరించిన.గొప్ప మేధావి రోశయ్య అని శిద్దా రాఘవరావు తెలిపారు.
ఆయన జీవితం మాకు ఒక స్ఫూర్తి అని అన్నారు.ఆర్ధిక రంగ నిపుణులుగా,సమర్ధవంత నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని విలక్షణ వ్యక్తిత్వం ఆయనకు వన్నె తెచ్చింది అని అన్నారు ఆయన మరణం నేటి రాజకీయాలలో ఒక శకం ముగిసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయనను కోల్పోవడం కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినట్లు భావిస్తున్నట్లు శిద్దా రాఘవరావు తెలిపారు.

LEAVE A RESPONSE