Suryaa.co.in

Andhra Pradesh

వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు

– తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ
– పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఏమన్నారంటే.. “గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే.. జగన్ చెడ్డపేరు తెచ్చుకున్నారు. హామీలు అమలు చేయకుండా గతంలో మోసం చేశారు. రుషికొండపై ఆయన కబ్జాలు చేశారు. వైఎస్ఆర్ కు జగన్ కు పొంతనే లేదు. వైకాపా అంతం అయినట్లే.. ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి” అని షర్మిల కోరారు.

LEAVE A RESPONSE