– ఈ కేసును విచారించే అధికారం సజ్జనార్ కు లేదు
– సజ్జనార్ పై 7 కేసులు ఉన్నాయి…ఆయన సిట్ చీఫ్ గా ఉండటం ఏమిటి? ?
– ఆనాడు ఉన్న పోలీస్ అధికారులను విచారణ చేయాలి.
– తెలంగాణ సంపదను నైనీ కోల్డ్ బ్లాక్ దోచుకుంటుంది
– కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాకులు పెట్టీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు
– కేంద్రం లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని అమిత్ షా చెప్పగలరా?
– బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: దేశ భద్రత కోసం, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం నాకు తెలుసు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రేవంత్ రెడ్డి బజారున పడేశాడు.
10 యేండ్లలో కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నాడు. దీని పై వీరోచితంగా కేటీఆర్, హరీష్ రావు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
కేటీఆర్, హరీష్ రావు పైన అక్రమ కేసులు పెట్టిన మడమ తిప్పకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. తెలంగాణ సంపదను నైనీ కోల్డ్ బ్లాక్ దోచుకుంటుంది.. దీని పై బిఆర్ఎస్ మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కూల్చివేసింది. దీన్ని డైవర్ట్ చేసేందుకు కమిషన్ వేశారు.
ఈ- ఫార్ములా ఈ కార్ రేస్ సిట్ పేరుతో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లేకున్న సిట్ పేరుతో కేటీఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ చట్ట బద్దంగా జరుగుతుంది.
బ్రిటిష్ కాలం నాటి నుంచి దేశ భద్రత కోసం టెర్రరిస్టుల నెంబర్స్ ను ట్యాపింగ్ చేస్తారు. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తుంది.దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని ఆనాడు ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారికంగా చెప్పాడు. దేశ భద్రత కోసం పార్లమెంట్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని మన్మోహన్ సింగ్ చెప్పారు.
మన్మోహన్ సింగ్ కు ఉన్న స్టేచర్ రేవంత్ రెడ్డికి ఉందో లేదో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ గోప్యంగా పోలీసులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఈ విషయం పై ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఏ రాజకీయ నాయకుడుకి తెలియదు.
హోం మంత్రికి కూడా…ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడో ఉంటుందో తెలియదు. అంత రహస్యంగా ఇంటిలిజెన్స్, ఎస్ఐబి వ్యవస్థలు ఉంటాయి.
రేవంత్ రెడ్డి వికృత క్రీడలకు …అలాంటి వ్యవస్థలను రేవంత్ రెడ్డి దిగజార్చారు. ప్రమోషన్ ల కోసం రేవంత్ రెడ్డి వికృత క్రీడలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెస్ట్ హౌస్ లలో దోపిడి చేస్తున్నారు. తుపాకులు పెట్టీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. ఇవ్వన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెడుతుంటే, కుట్ర పూరితంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో 350 మందినీ విచారించారు. అందులో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని విచారణలో తేలింది. విచారణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ను బెదిరించారు. అయిన ఏ ఒక్కరు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పలేదు.కావాలనే మరోసారి సిట్ ఏర్పాటు చేశారు.. బిఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు, అక్రమ సిట్ ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.
సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారు. ఈ కేసును విచారించే అధికారం సజ్జనార్ కు లేదు. సజ్జనార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక హక్కు సజ్జనార్ , శివధర్ రెడ్డి లకు లేదు. విచారణ చేస్తే, ఇప్పుడున్న మంత్రులను విచారించాలి, మంత్రుల అక్రమాలు ఎక్కువయ్యాయి.
చట్ట పరంగా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం జరిగినట్లు అనుమానం ఉంటే, ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులను విచారణ చేయాలి. నాయకులకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి సంబంధం ఉండదు.
ప్రజల గొంతుకగా రాజీలేని పోరాటం చేస్తుంటే, బిఆర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల గొంతుకగా రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం. విచారణల పేరుతో బిఆర్ఎస్ నాయకుల గుండెలు ఎన్నిసార్లు చీల్చిన, విచారణ అధికారులకు ఒకే ఒకటి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు, అభివృద్ధి మాత్రమే.
రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో.. పోలీస్ అధికారులు బలికాకండి. కేటీఆర్ ను విచారణకు పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశ భద్రత కోసం 9 వేల ఫోన్లు ట్యాప్ చేశామని ఆనాడు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే.. చెప్పారు.
లోతైన విచారణ జరిగితే సజ్జనార్ పైన జరగాలి. ఎందుకంటే, సజ్జనార్ పై 7 కేసులు ఉన్నాయి. ఆయన సిట్ చీఫ్ గా ఉండటం ఏమిటి? కేంద్రం లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని అమిత్ షా చెప్పగలరా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మకైనందువల్లే రేవంత్ దౌర్జన్యాల మీద బీజేపీ మాట్లాడటం లేదు