Suryaa.co.in

Telangana

రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోయిన వైద్యుడి కుటుంబాన్ని పరామర్శించిన సంగప్ప

వెంకటాపుర్ కిషన్ నాయక్ తండాలో ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించిన ఫిజియోథెరపీస్ట్ శ్రీకాంత్ su కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్పా పరామర్షించారు.

ఫిజియథెరపీ సేవలో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆకస్మికంగా మరణించడం చాలా బాధకలిగించిందనీ సంగాప్ప అన్నారు. నాలుగు రోజుల కిందట ఒక పేషెంట్ కు ఫైజియో థెరపీ చేసి వస్తుండగా అల్లడుర్గ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో శ్రీకాంత్ చనిపోయారు.

నిజాంపేట్ మండలం రామచందర్ తండాలో ఆకస్మికంగా మరణించిన మోఘావత్ శంకర్ కుటుంబాన్ని సంగప్ప పరామర్శించారు. దేవుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

సంగప్ప వెంట బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నగేష్ యాదవ్, నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, సీనియర్ నాయకులు సాయిరాం పట్నం మాణిక్, ఈశ్వర్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE