– ఆ 7660 కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాల్సిందే
– మంగళగిరిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఛాంబర్ తలుపులు మూసి.. గడియ పెట్టి.. కమిషనర్ను నిర్బంధించి ఘెరావ్
మంగళగిరి : ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అధికారులను నిలదీస్తూ.. కేంద్ర ప్రభుత్వం మా గ్రామపంచాయతీలకు పంపించిన నిధులను ఏం చేశారో మీరు, మీ ముఖ్యమంత్రి, మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా సర్పంచులకు సమాధానం చెప్పాలని.. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. సర్పంచుల తో కలిసి కమిషనర్ చాంబర్ కి గడియ పెట్టి, కమిషనర్ని దాదాపు 3 గంటల సేపు ఆయన ఛాంబర్ లోనే నిర్బంధించి సర్పంచులు ధర్నా చేశారు.
తదుపరి రాజేంద్ర ప్రసాద్ ని, సర్పంచులను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు సర్పంచులకు, పోలీసులకు జరిగిన పెనుగులాట, తోపులాట, వాగ్వాదం తర్వాత బలవంతంగా
రాజేంద్రప్రసాద్, సర్పంచులను సుమారు 50 మంది పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు. తదుపరి స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు,సర్పంచుల సంఘం నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి, వినోద్ రాజు, అనేపు రామకృష్ణ నాయుడు, చుక్క ధనుంజయ్ యాదవ్, ఎండి ఇస్మాయిల్, రంగయ్య, మానం విజేత, గోగినేని వసుధ, మీనాక్షి నాయుడు, ప్రతాప్ నాయుడు, మూడే శివ శంకర్, వీరేష్, కనగాల మధు, కడలి గోపాలరావు తదితర సర్పంచులు పాల్గొన్నారు.