Home » హైకోర్టులో కేసీఆర్‌ కు షాక్

హైకోర్టులో కేసీఆర్‌ కు షాక్

-జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్
-కేసీఆర్ వాదనను త్రోసిపుచ్చిన హైకోర్టు
-సుప్రీంకు వెళ్లనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం, ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది. దీనితో తెలంగాణ హైకోర్టు తీర్పుపై, కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply