– తమిళనాట స్టాలిన్ సర్కారు హిందూవ్యతిరేక వైఖరి
– దీప స్తంభం మీద దీపం వెలిగించుకుంటే ఇబ్బంది ఏమిటి: మద్రాస్ హైకోర్టు
– హిందువులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
– హిందువులు నోరు మూసుకుని సైలెంట్ గా ఉంటేనే మతసామరస్యం వెళ్లి విరుస్తుందా?
తిరుప్పరంకుండ్రం అనేది తమిళనాడు లో మదురై దగ్గర ఒక అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి వారి దేవాలయం ఉన్న ఊరు. .స్వామి వారి ఆరు ముఖ్య దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి తమిళనాడులో ని అన్ని ప్రాంతాలు నుండే కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి మరియు కేరళ నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు.
ఈ దేవాలయం అనుకుని ప్రాచీనకాలపు కొండలు వాటిల్లో 6-8 శతాబ్దాలలో పాండ్య రాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది. కొన్ని చారిత్రక రికార్డ్స్ ప్రకారం ఈ గిరి 2వ శతాబ్దం నుండి హిందూ కేంద్రం గా ఉంది. ఇక్కడ ఒక దీప స్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభం పై దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం.
14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లిం లు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దానిని సికిందర్ షా దర్గా గా మార్చారు. తరువాత కాలంలో ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మారింది.
హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్య రాజుల శిల్ప కళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికి కనిపిస్తాయి.
ఈ స్థల వివాదం పై 1923 లో మదురై స్థానిక సబార్డినెట్ జడ్జి తీర్పు ఇస్తూ.. ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు అంతా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పు ఇచ్చి, కేవలం నెల్లి తోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గా లో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు మరియు దర్గా ఉన్న చిన్న ప్రాంతం పై ముస్లిం లకు హక్కుఇచ్చి, దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు సమాధులు నిర్మించడం నిషేధించింది. ఈ సబ్ జడ్జి తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు , ఆపై 1931లో లాండన్లోని ప్రివి కౌన్సిల్ కూడా దృవీకరించాయి.
కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, 2025లో ఫిబ్రవరి లో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలులు నిషేధించింది.
కార్తీగై దీపం ఉత్సవంలో (కార్తీగై మాసం, నవంబర్-డిసెంబర్) గిరి శిఖరంపై ‘దీపతూణ్’ (పాత రాయి స్తంభం)లో దీపం వెలిగించడం అనేది తమిళ శైవ-మురుగన్ సంప్రదాయాల్లో పురాతనమైనది, సంగం సాహిత్యం (అగ నానూరు, 1800 సంవత్సరాల క్రితం)లో ప్రస్తావించబడింది. గిరి శిఖరాలపై దీపాలు వెలిగించడం తమిళ సంస్కృతిలో ‘కుండ్రిన్ మీద ఇట్ట విలక్కాయి పోల’ అనే సామెతలో ప్రతిబింబిస్తుంది.
ఈ స్తంభం 6వ శతాబ్దం CE నుండి ఉంది (పాండ్య కాలం), సంప్రదాయం అప్పటి నుండి కొనసాగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం (1940లు)లో బ్రిటిష్ నిషేధం వల్ల ఆగిపోయి, 1920ల నుండి కింది భాగంలో (ఉచ్చిపిళ్లయార్ ఆలయం వద్ద) కొనసాగుతుంది. ఈ స్తంభం దర్గా సమీపంలో ఉన్నందున, 1912లో కోర్టు పరిమితులు విధించింది.
ఈ ప్రాచీన దీప స్తంభం మీద ఇకపై ప్రతీ సంవత్సరం దీపం వెలిగించుకుందికి అనుమతి కోరిన హిందు మున్నాని నేత రామరవికుమార్ మరి ఒక 10 మంది భక్తులకు 2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్) దీపతూణ్లో వెలిగించడానికి అనుమతి ఇచ్చింది, ఇది ‘తమిళ సంప్రదాయం’ అని, దర్గా హక్కులను ప్రభావితం చేయదని పేర్కొంది. ఏ ప్రాంతం ఎవరిది అని 1923లొనే తీర్పు ఇచ్చారు. దర్గాకు చెందని స్థలం మరియు దేవాలయానికి చెందిన స్థలంలో ఉన్న దీప స్తంభం మీద దీపం వెలిగించుకుంటే ఇబ్బంది ఏమిటీ అని ప్రశ్నిస్తూ డిసెంబర్ 3వ తేదీన CISF రక్షణతో దీప స్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది.
కానీ మదురై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ చేసి , అపీల్ ఇంకా విచారణకు రాక ముందే దేవాదాయ శాఖ అధికారులు మరియు పోలీసులు కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ సెక్షన్ 144 క్రింద నిషేదాజ్ఞలు విధించారు. మాకు హై కోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యంగా భక్తులను కొండపై నుండి దింపి కింది భాగంలో మాత్రమే దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు.
ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించడమే అని రామా రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు. హై కోర్ట్ సింగిల్ జడ్జి ఆదేశాలు అమలు కాకుండా కలెక్టర్ మరియు పోలీసులకు సహకరించిన దేవాలయం ఈవో తన తప్పు కప్పించుకుందికి హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయలేదు అని అధికారికంగా మరో కంటెంప్ట్ పిటిషన్ వేసాడు.
మద్రాస్ హై కోర్ట్ అన్ని విచారించి సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ధృవీకరిస్తూ దీప్ తూన్ మీద దీపం వెలిగించడం అనేది ప్రాచీన సాంప్రదయం అని, ఇది ఎవరి హక్కులకు భంగం కలిగించదు అని, రామ రవికుమార్ మరియు 10 మంది భక్తులకు దీపం వెలిగించుకుందికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వ అప్పీల్ ని కొట్టేసింది.
హై కోర్ట్ ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు లో ‘అర్జంట్ లిస్టింగ్’ కోరింది. ప్రత్యేక మెన్షనింగ్ అవసరం లేదు, నెంబరింగ్ చేసి లిస్ట్ చేయండి, అర్జెంట్ గా లిస్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాం అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది అని DMK విమర్శిస్తోంది. హై కోర్ట్ ఉత్తర్వులు మీద దర్గా కమిటీ మౌనంగా ఉన్నప్పుడు, తమిళనాడు ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా హై కోర్ట్ తీర్పు అమలు కాకుండా ఎందుకు చూస్తోంది అంటూ బీజేపీ తిరిగి ప్రశ్నిస్తోంది.
ఎన్ని దేవాలయాలు, దేవాలయాలు ఆస్తులు కబ్జా చేసినా, హిందువులు నోరు మూసుకుని సైలెంట్ గా ఉంటేనే మతసామరస్యం వెళ్లి విరుస్తుంది. కానీ, ఇటువంటి వాటిలో వేటి మీద అయినా హిందువులు తమ హక్కులను తిరిగి కోరితే వారిని మతవివాదాలు రెచ్చగొట్టే వారీగా చిత్రీకరిస్తారు సెక్యులర్ వాదులు.
అంతే కానీ, హిందువులకు ఆ దేవాలయం, ఆ గిరి పవిత్రమైనవి, మీరు అక్కడ అక్రమంగా దేవాలయం ఆక్రమించి ఒక చచ్చిన రాజుకి సమాధి అక్రమంగా కట్టారు, అది మీకు ఏమీ పవిత్రమైన మతపరమైన కట్టడం కాదు కాబట్టి, ఆ దర్గా తీసి ఆ గిరి మీద పూర్తి హక్కులు హిందువులకు ఇచ్చి మతసామరస్యం కాపాడండి అని ఏ సెక్యులర్ జీవి ముస్లింలకు చెప్పే ప్రయత్నం చేయడు.