వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మతో పాటు పలువురు టీడీపీ నేతలు బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు.