Suryaa.co.in

Andhra Pradesh

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

అమరావతి:- మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ప్రాణాలు విడిచారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలియజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ…సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డిపేరు తెచ్చుకున్నారని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

LEAVE A RESPONSE