Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో టీడీపీదే విజయం

వైసీపీ ఓటమి ఖాయం
జగన్‌ను పథకాలు గెలిపించవు
జగన్ ఓటమిని ఎవరూ తప్పించలేరు
సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలి
జగన్ రాజకీయ గురువు ప్రశాంత్‌కిశోర్ జోస్యం

హైదరాబాదు: కొద్దికాలం వరకూ జగన్ చేయిపట్టుకుని నడిపించిన ఎన్నికల వ్యూహకర్త, ఆయన రాజకీయ గురువు ప్రశాంత్ కిశోర్.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారు. జగన్ ఓటమిని ఎవరూ తప్పించలేరని స్పష్టం చేశారు. డబ్బులు పంచడమే కాదు. అభివృద్ధి కూడా ముఖ్యమేనని చెప్పారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించిన ప్రశాంత్‌కిశోర్ ఇప్పుడు కళ్లు తెరిచి నిజం చెప్పి వైసీపీకి చమటలు పట్టించారు.

వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని తేల్చేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు.పీకే వ్యాఖ్యలు టీడీపీలో సమరోత్సాహం కలిగించగా, వైసీపీని ఆందోళనలో నెట్టాయి.

 

LEAVE A RESPONSE