Suryaa.co.in

Telangana

పదేళ్ల తర్వాత మళ్లీ ఆ అదృష్టం

– కొండపై విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ.. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి.. స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు.. ఆలయ ఈవో భాస్కర రావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే పదేళ్ల కిందట.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు కొండపై గల పుష్కరిణిలోనే స్నానాలు ఆచరించి.. దర్శనాలు చేసుకునేవారు.

LEAVE A RESPONSE