Suryaa.co.in

Andhra Pradesh

లల సౌధం కళ్ల ముందు వాలింది

– ఆశల రాజధాని అంగరంగ వైభవంగా ఆవిష్కృతమైంది
– వేడుకలా రాజధాని పునః ప్రారంభోత్సవం
– అమరావతికి జేజేలు పలికిన ప్రజానీకానికి పాదాభివందనాలు
– ఏపీ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: అమరావతి 2.0కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర కదిలిందని, రూ.49,040 కోట్లతో కూడిన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో రాజధాని అంతటా పండుగ వాతావరణం కనిపించిందని ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం కాకాని నగర్ కార్యాలయం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజధాని గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారన్నారు. సభ జరిగే వెలగపూడితో పాటు అన్ని గ్రామాల్లోనూ ఇదే వాతావరణం కనిపించిందనీ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేసిన ప్రజానీకానికి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి కోసం భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు మురిసిపోయారు. ఐదేళ్లు అష్టకష్టాలు పడ్డారని, తిరిగి అమరావతికి ప్రాణం పోస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారని తంగిరాల సౌమ్య గుర్తు చేశారు.

LEAVE A RESPONSE