Suryaa.co.in

Andhra Pradesh

అప్పుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు
అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉంది
కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలి
రైతు భరోసా కింద జగన్ ఇస్తుంది కేవలం ఆరు వేల రూపాయల మాత్రమే
బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదు
టీడీపీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంను సందర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి
కేంద్ర నిధులతో నిర్మిస్తున్న నూతన భవనాలు పరిశీలించేందుకు వచ్చిన పురంధేశ్వరి
పురంధేశ్వరి కు స్వాగతం పలికిన ఇంజనీరింగ్ అధికారులు, శాస్త్రవేత్తలు
యూనివర్సిటీలలో జరుగుతున్న డ్రోన్ పరిశోధనల గురించి వివరించిన శాస్త్రవేత్తలు

పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏపీ ఏర్పడిన తర్వాత కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసింది. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది.కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది‌. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు.ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు‌.
వై ఏపి నీడ్స్ జగన్ లో సచివాలయల వద్ద పార్టీ జెండా ఎగురవేస్తున్నారు. అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉంది.మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర లేపారు.రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.రాజధాని అభివృద్ధి కోసం 2500 కోట్లు కేంద్రం ఇచ్చింది.అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి అనంతపురం రోడ్డుకు కేంద్రం నిధులు ఇచ్చింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనానికి, రిసెర్చ్ భవనానికి కేంద్రం నిధులు ఇచ్చింది.

ఎయిమ్స్ వద్ద నున్న హై టెన్షన్ వైర్లు తొలగింపు, త్రాగు నీటిని అందించకపోవడం క్షమార్హం కాదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో రాష్ట్రం చెప్పాలి. రైతు భరోసా కింద జగన్ ఇస్తుంది కేవలం ఆరు వేల రూపాయల మాత్రమే.రాష్ట్ర పాలకులకు వాళ్ళ జేబులు నింపుకోవడం పై ఉన్న శ్రద్ధ సుపరిపాలనపై లేదు. కేంద్రం ఇచ్చిన 1600 కోట్ల రూపాయలతో మంగళగిరి ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు.పది రూపాయల ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.

కానీ ఈరాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు కూడా పక్కకు తొలగించలేదు.కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.పేదవాళ్లకు సేవ చేసే సంస్థకు, మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం.ప్రధాని నరేంద్రమోది అవినీతి రహిత, సమర్థవంత పాలన అందిస్తున్నారు. బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదు. అణగారిన వర్గాల వారికి మేలు చేయాలన్న భారతీయ జనతాపార్టీ మూల సిద్ధాంతం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

కరోనా లేక పోయిన పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం అమలు చేస్తున్నాం. పేదలకు భరోసా కల్పిస్తూ, ఇన్సూరెన్స్ పాలసీ, పేదలకు పక్కా గృహాలు అందిస్తున్నాం అన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రమే నిధులు ఇస్తుంది. ఇక, ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదు.

ఒక పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు.మన పిల్లలకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారు.కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి జేబులు నింపుకోవడం తప్ప వైసీపీ నాయకులకు అభివృద్ధి మీద దృష్టి లేదు.ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తున్న నాయకులు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు కూడా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం కింద నిర్మించారు.

అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వడం లేదు. అమరావతి వెళ్లిపోయింది అనే బాధతో ఆందోళన చేస్తున్న మహిళలను, పోలీసులు అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం వేధించింది. అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఆలోచనతో 20 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అనంతపురం- అమరావతి హైవే రోడ్డును 28వేల కోట్ల రూపాయలతో కేంద్రం ఖరారు చేసింది.

చివరకు ఆ రోడ్లకు భూములు సేకరించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయడం లేదన్నారు. విభజన సమయంలో ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లాం లో ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చారు. గతంలో టీడీపీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి.

విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర కార్యాలయ ఇంచార్జి మకుటం శివ, జిల్లా ప్రవాస్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE