Suryaa.co.in

Andhra Pradesh

బాధితులను గట్టెక్కించే వరకు ప్రభుత్వం విశ్రమించబోదు

– బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు

బాపట్ల: చెరువు జమ్ములపాలెం వాస్తవ్యులు కోడూరి సింగయ్య – శివకుమారి వరద బాధితులకు మేము సైతం అండగా ఉంటామని ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 వేల రూపాయలు చెక్కును బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందజేశారు.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ..ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకువచ్చి, అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కష్టాల నుండి వరద బాధితులను గట్టెక్కించే వరకు మన ప్రభుత్వం విశ్రమించబోదు.

తోచిన సాయంతో ముందుకు రావాలని ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వరద బాధితుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా. వీరితో పాటు సాయానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE