ఒకప్పుడు భారతీయుల నాలుకపై ఆడిన ‘ది గ్రేట్ ఇండియన్ టేస్ట్’.. ఇప్పుడు మన ఓర్వకల్లు మట్టిలో ఇలా ప్రాణం పోసుకుంటోంది. బ్రాహ్మణపల్లి సమీపంలో 80 ఎకరాల సువిశాల సామ్రాజ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా ₹1,622 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ క్యాంపా కోలా మెగా ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ హబ్స్లో ఒకటిగా నిలవబోతోంది.
దాదాపు 1,200 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. సీమ బిడ్డల వలసలకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎర్రటి తివాచీ పరచడమే కాకుండా, ఏడాదికి దాదాపు ₹500 కోట్ల జిఎస్టీ రాబడితో రాష్ట్ర ఖజానాకు ఇది వెన్నుముకలా మారనుంది.
ఇది రిలయన్స్ చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ₹768 కోట్లతో ఏర్పాటు చేయబోయే స్నాక్స్ మరియు బిస్కెట్ల ఫుడ్ పార్క్ ద్వారా ఈ ప్రాంత సరఫరా వ్యవస్థను (Supply Chain) మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది.
ఈ ప్లాంట్ వల్ల కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే కాదు, ఫ్రూట్ జ్యూస్ల ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో జరగబోతోంది. ఇది మన రాయలసీమ ఉద్యానవన రైతులకు లభించిన అసలైన వరప్రసాదం! అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పండే బత్తాయి, మామిడి, పప్పాయ వంటి పండ్లకు ఇకపై మద్దతు ధర కోసం రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు. రిలయన్స్ నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలుదారుగా మారుతుంది. పండ్లను పండ్ల లాగే కాకుండా, జ్యూస్లుగా మార్చి వాల్యూ ఎడిషన్ చేయడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు, రాయలసీమను ప్రపంచానికి కేవలం ‘ఫ్రూట్ బాస్కెట్’గా మాత్రమే కాదు.. గ్లోబల్ ‘ఫ్రూట్ జ్యూస్ జార్’గా మార్చే దిశలో ఈ ప్లాంట్ తొలి అడుగు. నాడు అనంతపురానికి ‘కియా’ ఎలాగైతే ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిందో, నేడు కర్నూలుకు ‘క్యాంపా కోలా’ అలాంటి అంతర్జాతీయ గుర్తింపును తేనుంది. ₹35.61 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక షెడ్లు, లాజిస్టిక్స్ హబ్స్తో ఈ ప్రాంతం పారిశ్రామిక కళతో విరాజిల్లుతోంది.
సీమ ఎడారి అని పిలిచిన అనంతలో కొరియా వారి చేత కార్లు పండించినట్లు, రాయలసీమను ఒక్కో చుక్కా బిందు సేద్యంతో హార్టికల్చర్ హబ్గా మార్చినట్లు, కర్నూలులో ఈ ప్లాంటుకు కూడా నీరు నాయుడు మాత్రమే ఇస్తాడనే అంబానీ నమ్మకం ఈ క్యాంపా కోలా ప్లాంటు సాకారం కావడానికి కారణం. రాయలసీమలో పరిశ్రమల రాక అంటే కేవలం యంత్రాలు తిరగడం కాదు.. ఈ గడ్డపై పండే ప్రతి పండు తీపిని ప్రపంచానికి రుచి చూపించడం!
త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి ఆ మొదటి క్యాంపా కోలా బాటిల్ బయటకు రానుంది.. ఆ విజిల్తో కర్నూలు పేరు దేశవ్యాప్తంగా సరికొత్త రేంజ్లో మారుమోగడం ఖాయం!