Home » కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం

కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం

-స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు
-సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు
-కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకం
-బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారు
-సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,సోమ భరత్ కుమార్ ,గెల్లు శ్రీనివాస యాదవ్ ,లలిత రెడ్డి

హైద‌రాబాద్‌: జులై 1 వ తేదీ నుండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్,ఇండియన్ పీనల్ కోడ్,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ చట్టాలు ఉన్నాయి. మార్పు అంటే మంచి జరగడం. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా వున్నాయి.

2023 ఆగస్టులో చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు.

దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుంది. దేశ వ్యాప్తంగా వున్న సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖా మంత్రి,న్యాయ శాఖా మంత్రులకు లేఖ రాశాను. చట్టాలను ఇంగ్లీష్ లో ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలో ఉంది.

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ కు భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే పేరు పెట్టారు. కొత్త చట్టాలకు హిందీ,సంస్కృతంలో పేర్లు పెట్టారు. కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయి.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లు ఆందోళన చేయవద్దని అన్ని బార్ అసోసియేషన్స్ కు లేఖలు రాశారు. మోడీ తెచ్చిన నల్ల చట్టాలతో రైతులు చనిపోయారు. చట్టాల మార్పులను వాయిదా వేయాలని మోదీని డిమాండ్ చేస్తున్నాం.

ఎఫ్.ఐ.ఆర్ ను రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారు. స్టేషన్ బెయిల్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారు. భాదితుడు హింసకు గురి అవుతున్నారు. దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుంది. కొత్త చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి.

చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని వుంది. కొత్త చట్టాల వలన భాదితుడికి అన్యాయం జరుగుతోంది. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చారు. బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారు.

కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలి. కొత్త చట్టాలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుంది.

Leave a Reply