Suryaa.co.in

Telangana

యువతిని మోసం చేసి మోహం చాటేసిన పంచాయతీ సెక్రెటరీ

– ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు, బంధువుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా లో ప్రేమ పేరుతో ఓ యువతిని పంచాయతీ కార్యదర్శి మోసం చేసిన ఘటన సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు తన బంధువులతో బైఠాయినంచి తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. చిన్న బొంకూరు గ్రామానికి చెందిన అర్నకొండ శంకర్ అంతర్గాంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

శంకర్ కు ధర్మారం మండలం నర్సింగాపూర్ కు చెందిన మారపాక సరితతో గత 12 ఏళ్ల క్రితం కరీంనగర్ లో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. 12 ఏళ్లు తనను సర్వం వాడుకొని ఇప్పుడు తీరా పెళ్లి చేసుకోమ్మని అడిగితే.. తనను కాదని వేరే యువతితో శంకర్ వివాహం కుదుర్చుకున్నాడు.

దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ సరిత తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించగా, ఆమె పలు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. శంకర్ ను పెళ్లి చేసుకోమ్మని అడిగితే.. రూ.30 లక్షల కట్నం తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటానంటనని చెప్పాడని సరిత తెలిపింది.

LEAVE A RESPONSE