Suryaa.co.in

Telangana

పంచాయతీ కార్యదర్శులసర్వీస్ ను క్రమబద్దీకరించాలి

-ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ

పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్. గ్రామాల అభివ్రుద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనది. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివి. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరగడం బాధాకరం.

ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యక్రుత్యంగా మారడం దారుణం. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్.

LEAVE A RESPONSE