Suryaa.co.in

Telangana

ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో తట్ట, పార, గడ్డపార

-ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, బ్యాగ్
-ఉపాధి హామీ కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేసి, వారితో మమేకమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గట్టికల్ (రాయపర్తి) జూన్ 5: కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ, పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూలీల శ్రేయస్సు కోరి, ఉపాధి హామీ కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, ఆయా వస్తువులను తీసుకెళ్ళే విధంగా ఓ మంచి బ్యాగు ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాయపర్తి మండలం ఘటికల్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా, ఆ దిశగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ.. ప్రయాణిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ కూలీలను చూసి ఆగారు. అక్కడే వారితో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు.

అనంతరం వారితో పారపట్టి మట్టి తవ్వారు. అలాగే వారితో కొద్దిసేపు గడిపి, వారి కష్టసుఖాలు తెలుసుకొని, ఎండల్లో పనులు ఎలా జరుగుతున్నాయి? అంటూ కనుక్కొని వారి అవసరాలు తెలుసుకొని వారికి ఆయా పనిముట్లు, వస్తువులను పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఆది కూలీ తిడుతుందా అని వారినడిగి ఉపాధి హామీ పథకంపై కేంద్ర వైఖరిని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టతని వివరించారు.

గతంలో ఉపాధి హామీ కింద మట్టి తవ్వకాల పనులు మాత్రమే చేపట్టే వారని, ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేసి ఆయా పనులను ఉపయోగంలోకి తెచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వారికి వివరించారు.

LEAVE A RESPONSE