Home » వాళ్ళ ఫోన్ కాల్ డేటా పరిశీలించాలి

వాళ్ళ ఫోన్ కాల్ డేటా పరిశీలించాలి

• మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటిలిజెన్స్ సీతారామాంజనేయులు, ఐజి కొల్లి రఘురామరెడ్డి ఫోన్ కాల్ డేటా పరిశీలించాలి
• టీడీపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోలీసు అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ పన్నిన కుట్రను కూడా సిట్ వెలికి తీయాలి

• మాచర్లలో పోలింగ్ సందర్భంలో అరాచకం సృష్టించి రక్తపాతానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పిన్నెళ్లి అతని తమ్ముడు వెంకట రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
• టీడీపీ నేత నానిపై హత్యాయత్నానికి కారకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు మోహిత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
• పోలింగ్ రోజున అరాచం సృష్టించి అయినా జగన్ గెలవాలి, టీడీపీ ఓడిపోవాలని కుట్రపన్ని రాష్ట్రం అంతటా పోలీసు అధికారులకు ఫోన్లుచేసి బెదిరించిన
• టీడీపీ హయంలో ఎన్నికల కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటిలిజెన్స్ డీజీనీ, ఎందరో ఎస్పీలను బదిలీ చేస్తే జై కొట్టిన జగన్ ఈ రోజు అధికారును బదిలీ చేస్తే ఎన్నికల కమిషన్ తప్పుడు పట్టడం అన్యాయం
• గతంలో ముగ్గురు ఒకే కులానికి చెందిన డీఎస్పీలకు పోస్టింగ్ లు ఇస్తే 33 మందికి ఇచ్చారని గగ్గోలు పెట్టిన జగన్ ఈరోజు ఆయన కులస్తులకు ఎంతమందికి పోస్టింగ్ ఇచ్చారో చెప్పాలి
• టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఓటమి భయంతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టించి గెలవాలని వైసీపీ నేతలు యత్నించారు. విధ్వంసం సృష్టించారు. టీడీపీ నేతలు, టీడీపీ సానుకూల ఓటర్లపై హత్యలకు పూనుకున్నారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తీరు దొంగే దొంగా దొంగా అనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించి ఎలక్షన్ కమిషన్ పై మళ్లీ బురద చల్లేందుకు యత్నిస్తున్నాడు. ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్ లో జగన్ రెడ్డి ప్లాన్ ‘B’తో అరాచకం సృష్టించాడు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుండే అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించింది. ఆ అధికారులు సరిగ్గా పనిచేయడంలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది డీజీపీనే.

గతంలో 2019న ఒకే రోజు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు పలువురు ఎస్పీలను తొలగిస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు భేష్ అని జగన్ రెడ్డి మెచ్చుకున్నది నిజం కాదా? నాడు ముగ్గురు కమ్మ కులం అధికారులు ఉంటే 33 మంది డీఎస్పీలు నియమించుకున్నారని జగన్ రెడ్డి గగ్గోలు పెట్టాడు. మళ్లీ జగన్ రెడ్డే ముగ్గురు కమ్మకులం అధికారులు మాత్రమే ఉన్నారని శాసన సభలో చెప్పింది నిజమే కదా. నేడు అసమర్థ ఆఫీసర్లను తొలగిస్తే ఎన్నికల కమిషనపై జగన్ రెడ్డి దాడి చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన 12 మందిలో ఆరుగురు జగన్ రెడ్డి కులస్తులే ఉన్నారు.

రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లు పోలింగ్ రోజున ఎక్కడ ఉన్నారు? అందరూ కలిసి జగన్ గెలుపుకు కుట్ర పన్నింది నిజం కాదా? రాష్ట్రంలో రక్తపాతానికి కుట్రలు చేసింది వీరే.. వీరి కాల్ డేటా బయటకు తీస్తే అంతా తెలుస్తుంది.

మాచర్లలో నరమేధానికి కారకులైన ఎమ్మెల్యే రామకృష్ణ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరాచకం సృష్టించి హౌస్ అరెస్ట్ అయిన మాచర్ల ఎమ్మెల్యే అతని సోదరుడు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి జగన్ రెడ్డి సూచనలతో రాష్ట్రం విడిచి పారిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మెహిత్ రెడ్డి లు హత్యాయత్నం చేశారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలి.

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సృష్టించిన అరాచకం, విధ్వంసానికి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. రాజంపేట డీఎస్పీ చైతన్య కు తాడిపత్రిలో పని ఏంటి… జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు ద్వంసం చేసి దివ్యాండిపై దాడి చేయడం చాలా బాధాకరం… అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి.

అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేక జగన్ రెడ్డి రక్త చరిత్రకు తెరలేపాడు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీపీ సీతారామాంజనేయులు, ఐజీ కొల్లి రఘురామిరెడ్డి పన్నిన కుట్రను సిట్ దర్యాప్తులో వెలికితీసీ హింసకు కారకులైన వైసీపీనేతలను జైలుకు పంపాలి . జగన్ రెడ్డి నేర చరిత్రపై బ్రిటన్ లోని ఓ యూనివర్సిటీలో చర్చకు వచ్చిందంటే జగన్ రెడ్డి ఎంత అవినీతి పరుడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. గెలపు కూటమిదే. ప్రజలు అరాచక పాలనను తరమికొట్టేందుకే పోటెత్తి వచ్చి ఓట్లు వేశారు.

Leave a Reply