Suryaa.co.in

Telangana

ప్రజా ప్రతినిధుల పెండింగ్ బిల్లుల విడుదలపై యోచన

– పెండింగ్ బిల్లులు సుమారు 1,300 కోట్ల కోట్ల రూపాయలు
– బిల్లుల పెండింగ్ కు కారణమైన బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ : 10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న ప్రజా ప్రతినిధుల బిల్లుల విడుదలకు ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

సర్పంచులు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు వంటి ప్రజా ప్రతినిధులు

7-12-2023 నాటికి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు సుమారు 1,300 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఇందులో 10 లక్షలు లోపు బకాయిల విలువ సుమారు 400 కోట్ల వరకు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తాను గమనించి 10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్లో పెట్టారని, వారిని వీధులపాలు చేశారని తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన టిఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల పెండింగ్ బిల్లుల గురించి బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు

LEAVE A RESPONSE