పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది.. ఫతేగఢ్ సాహెబ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.