Suryaa.co.in

Andhra Pradesh

గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై సిఐడి ఏడీజికి వర్ల రామయ్య ఫిర్యాదు

– టిడిపి నాయకులపై సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై సిఐడి ఏడీజికి ఫిర్యాదు చేసిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

అమరావతి : టిడిపి నాయకులపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవు. వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.

3 ఆగస్టు 2022న ఏ2 విజయ సాయి రెడ్డి సైతం టిడిపి నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. 3 ఆగస్ట్ 2022న టిడిపి నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సి.ఐ భూషణంని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించాడు. సి.ఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి మా నాయకులపై అసభ్యకరంగా దుర్భాషలాడాడు.

మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించాడు.ఇప్పటి వరకు మా పిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదు. అధికార పార్టీ నేతలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోండి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సి.ఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE