Suryaa.co.in

Andhra Pradesh

ప్రగతి కోసమే పల్లె పండుగ

– పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం
-శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక
– నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య తెలిపారు.

బుధవారం మండలంలోని కమ్మవారిపాలెం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి అధికారులు మరియు కూటమి నేతలతో కలసి భూమి పూజ చేశారు.

తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన వందరోజుల్లోనే పెద్ద ఎత్తున గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. మండలంలో 5 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు రూ.60లక్షలతో కమ్మవారిపాలెం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు.

LEAVE A RESPONSE