Suryaa.co.in

Andhra Pradesh

బాలికపై అఘాయిత్యం అమానుషం

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆవేదన

అమరావతి, మహానాడు: పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది… ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజం లోని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి.

ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తాం. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని కోరామని ఆయన పేర్కొన్నారు.

LEAVE A RESPONSE