Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో (2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్ ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

LEAVE A RESPONSE