Suryaa.co.in

Andhra Pradesh

కాలినడకన విజయవాడ దుర్గమ్మ గుడికి…

కపిలేశ్వరపురం మండలం, వాకతిప్ప గ్రామానికి చెందిన శ్రీ అల్లూరి రామకృష్ణ చౌదరి, కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన పువ్వుల వీరవెంకట సత్యప్రసాద్ (చిట్టిబాబు) లు విజయవాడ శ్రీ కనక దుర్గమ్మవారి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రావాలని, మండపేట ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు 4వ సరి గెలవాలని మొక్కుకోవడంతో తమ కోరిక నెరవేరిన కారణంగా సోమవారం ఉదయం విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. తొలుత మండపేట వేగుళ్ళ వీర్రాజు సెంటర్ (కలువపువ్వు సెంటర్) నందు కనకదుర్గమ్మ గుడిలో రామకృష్ణ చౌదరి, చిట్టిబాబు లతో కలసి ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ యాత్రను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రారంభించారు. 5 రోజులపాటు సాగే యాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ఎమ్మెల్యే ఆ అమ్మవారిని ప్రార్ధించారు.

ఈ సంధర్బంగా అల్లూరి రామకృష్ణ చౌదరి మాత్లాడుతూ ఎమ్మెల్యే గా వేగుళ్ళ గెలుపొందాలని తన మొదటి మొక్కుగా జులై 19న తిరుమల పాదయాత్ర మొదలు పెట్టి దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగిందన్నారు. అదే విధంగా తన రెండవ మొక్కుగా ఈరోజున పువ్వుల చిట్టిబాబు గారితో కలసి విజయవాడ కాలినడకన వెళ్ళటం జరుగుతుందన్నారు. విజయవాడ అనంతరం అన్నవరం వెళ్ళనున్నట్లు రామకృష్ణ చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, కాళ్ళకూరి శ్రీనివాస్, తదితర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE