– వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు
– ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది
– ఈరోజు దెబ్బ తిన్నవారు మేము చెప్పినా వినకపోవచ్చు
– 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం కమిషన్
– బాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు
– ఇండోసోల్ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు
– బీపీసీఎల్కు ఇండోసోల్ కంపెనీ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ
ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లి: రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు కుట్రల నేపథ్యం. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వైఖరి. పొలిటికల్ గవర్నెన్స్ నడిపిస్తున్న
తీరు.. ఇవన్నీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి
కనిపిస్తోంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, పలుకుతోంది వైయస్సార్సీపీ మాత్రమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. రైతులు, అక్కచెల్లెమ్మలు,
నిరుద్యోగులు, విద్యార్థులు.. చివరకు ఉద్యోగులకు కష్టం వచ్చినా కూడా వైయస్సార్సీపీనే ప్రశ్నిస్తోంది.
ఏడాది నుంచి చంద్రబాబు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కోసం,
వారికి పెట్టుబడి సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరస్థితి, లేని ఇన్పుట్ సబ్సిడీ అన్నింటిపై 2024, డిసెంబరు 13న వైయస్సార్సీపీ రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేశాం.
కరెంటు ఛార్జీల బాదుడుపై గత డిసెంబరు 24న రాష్ట్రంలో నిరసన కార్యక్రమం. ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా బాదుడుపై నిరసన కార్యక్రమం. పోరుబాట నిర్వహించాం. పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం. విద్యాదీవెన, వసతిదీవెన ఎగ్గొట్టిన వైనం. వాటన్నింటిపై మార్చి 12, యువతపోరు నిర్వహించాం.
నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రశ్నించాం. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మోసాలు వివరిస్తూ, వెన్నుపోటు దినం నిర్వహించాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బాకీలు అడిగాం. ఆరోజు రాష్ట్రమంతా కార్యక్రమం. ఇప్పుడు కూడా బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్న నినాదంతో,
‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ పేరుతో చంద్రబాబు మోసాలు ఎత్తి చూపుతూ, ప్రజలను చైతన్యులను చేస్తూ.. నాడు చంద్రబాబు ఇచ్చిన
బాండ్లు టీడీపీ నాయకులకు చూపిస్తూ, ప్రభుత్వం పడిన బకాయిలు అడుగుతూ రాష్ట్రమంతా కార్యక్రమం కొనసాగుతోంది. జూలై (ఈనెల) 21 నుంచి
గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అందరినీ చైతన్యులను చేసే దిశగా కార్యక్రమం నిర్వహిస్తాం.
చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన ఏదీ చేయడని చెప్పి, వైయస్సార్సీపీ తలుపు తడుతున్నారు. ఎందుకంటే, వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా, పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండే వారు. స్పందన కార్యక్రమంలో మా పార్టీ వారి కంటే ఎక్కువగా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించేవారు.
తట్టుకోలేక వేధింపుల పర్వం
అదే ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటంటే.. చంద్రబాబు మాట ఏ పోలీసు అధికారి అయినా వినకపోతే.. డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంకా మరో డీజీపీ స్థాయ అధికారి సునీల్కుమార్, మరో అధికారులు సంజయ్, కాంతిలాల్రాణ టాటా, విశాల్గున్నీ.. అందరిపై తప్పుడు కేసులు వేధింపులు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు.
వీరు కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషినల్ కమాండెంట్లు, రెండు అసిస్టెంట్ కమాండెంట్లను కూడా హెడ్ క్వార్టర్స్లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు.
8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్లో ఉన్నారు.
చంద్రబాబు మాట వినని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు.
కొందరు అధికారుల అధికార దుర్వినియోగం
ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే డీఐజీలు కేంద్రంగా కొందరు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల
కొందరు ఆ జోన్కి మాఫియా డాన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయన ఆర్మీ. నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే పర్మిషన్, పేకాట క్లబ్బులు, నడిచే పరిశ్రమల నుంచి డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కప్పం వసూలు చేసి రివర్స్లో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు.
సగం వీళ్లు తీసుకుని మరోసగం చినబాబు, పెదబాబుకి పంపుతారు. ఇవన్నీ తట్టుకోలేక సిద్దార్థ కౌశల్ వంటి యంగస్టర్, యంగ్ ఐపీఎస్
ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్లడానికి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో పడలేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఏ
ప్రభుత్వంలో అయినా పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంటే, నేరస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని
వదిలేసి వెళ్లిపోతున్నారు.
యథేచ్ఛగా దాడుల పర్వం
కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్. బీసీ. నా సోదరి హారిక. టీడీపీ సైకోలు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసలు ఆమె చేసిన తప్పేమిటి? ఎందుకు ఆమె మీద
దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు? ఇంత హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళ, నా చెల్లి హారికను టీడీపీ వారు
మహానటి అంటున్నారు. కనీసం సిగ్గుందా? అన్నీ చేసిన మీరు ఆమెను మహానటి అంటారా?
పెడనలో సమావేశం నిర్వహిస్తే.. పేర్ని నాని, జోగి రమేష్ తదితరులపై కేసు పెట్టారు. పార్టీ ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకోకూడదా? అసలు మనం
ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
నా ప్రతి పర్యటనలో దాడులు చేసే ప్రయత్నం. తప్పుడు కేసులు పెట్టించడం. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గత ఏడాది
మిర్చి క్వింటా ధర రూ.27 వేలు పలికితే, చంద్రబాబు ప్రభుత్వంలో అది రూ.8 వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, వారికి మద్దతు ఇస్తూ,
మిర్చియార్డుకు పోయింది జగన్ మాత్రమే. అది తప్పేనా? ఆరోజు నా పర్యటనకు నా సెక్యూరిటీ తగ్గించాడు. ఆయనకు మూడ్ వస్తే ఇస్తాడు. లేకపోతే జడ్ ప్లస్ కేటగిరీ తీసేస్తాడు. మళ్లీ మాపైనే కేసు పెట్టారు. జూన్ 18న, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన. మా పార్టీ
కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్తే అడ్డుకోవాలని ప్రయత్నం.
నా కోసం ప్రజలు వస్తే, చంద్రబాబుకు ఏం ఇబ్బంది? ఆయన కార్యక్రమానికి జనం రాకపోతే, మాకేం సంబంధం? నా కార్యక్రమానికి రావొద్దని, మా పారీ నాయకులకు నోటీసులు. హౌజ్ అరెస్టులు. అలా నా కార్యక్రమానికి జనం రాకుండా కుట్ర. ఇంకా 5 కేసులు నమోదు.
ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?
సినిమా డైలాగ్లో పోస్టర్లుగా ప్రదర్శిస్తే.. ఇద్దరిని అరెస్టు చేశారు. నీకు ఆ డైలాగ్లు నచ్చకపోతే, సెన్సార్బోర్డుకు చెప్పి, వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్లు ఇంకా దారుణం. సినిమా డైలాగ్లు ప్రదర్శిస్తే, కేసులు పెట్టడం ఏమిటి? సినిమాలు ఆపేయండి. ఎవరో ఒకరు సినిమా డైలాగ్లు ప్రదర్శిస్తే, వారికొచ్చిన నష్టం ఏమిటి? 131 మందికి నోటీసులు. ఇద్దరిని రిమాండ్కు పంపారు.
చంద్రబాబు ఎవరి పేరు చెబితే, వారిని పిలిపించడం రోజంతా కూర్చోబెట్టడం.. కేసులు పెట్టడం. ప్రతి ఛార్జ్షీట్లో ఓ ముగ్గురు, నలుగురి పేర్లు రాసి. అండ్ అదర్స్ అని రాస్తున్నారు. ఆ తర్వాత తమ టార్గెట్లో ఉన్న వారిని అందులో జోడిస్తున్నారు.
మామిడి రైతుల కష్టాలు. అక్కడా మాకు వేధింపులు మామిడి రైతుల సమస్యలపై జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మామిడి ధర దారుణంగా పతనం. మే రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా, జూన్ చివరి వరకు పట్టించుకోలేదు. నెల రోజులకు పైగా ఆలస్యం
చేశారు. టీడీపీకి సంబంధించిన వారి కంపెనీలు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేశాయి. ఇక్కడ కిలో మామిడి రూ.12 అంటున్నారు. కానీ, ఎంత మందికి ఆ ధర ఇచ్చారు. 6.5 లక్షల టన్నుల పంట. 2.5 లక్షల ఎకరాల్లో సాగు. 76 వేల మంది రైతులకు ఇక్కట్లు. వారికి సంఘీభావంగా నేను అక్కడికి పోవడం తప్పా? ఆ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం తప్పా? అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు..
కాకాణి గోవర్ధన్రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు.
వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్ అధికారులు వీరు. వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్ని కేసులకు ఒకటే
మోడస్ ఆపరాండి. తప్పుడు వాంగ్మూలంతో తమ టార్గెట్లో ఉన్న వారిపై కేసులు.అరెస్టులు.
అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?
ఇదే సంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు ఇలాగే వ్యవహరిస్తే, మీ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు వేసిన
విత్తనం రేపు వృక్షమై పోతుంది. రేపు ఇదే కొనసాగితే.. చంద్రబాబు, టీడీపీ వారి పరిస్థితి ఏమిటి? ఈరోజు దెబ్బ తిన్న వారు ఊర్కోరు కదా? ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది. ఈరోజు దెబ్బ తిన్నవారు, మేము చెప్పినా వినకపోవచ్చు. కాబట్టి చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకో. తప్పుడు సంప్రదాయం వదిలెయ్. ఏదీ లేదు. అయినా ఎవరూ మాట్లాడొద్దు పిల్లలు చదువులు మాని, పనులకు పోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్. అలా రూ.4,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఏటా ఏప్రిల్లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లు గడిచాయి కాబట్టి, రూ.2200 కోట్లు. రెండూ కలిపి రూ.6,600 కోట్లు కావాలి కానీ, ఇచ్చింది మాత్రం రూ.770 కోట్లు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3600 కోట్లు చొప్పున బకాయి. ఆరోగశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.4500 కోట్లు బకాయి.
చంద్రబాబు తొలగించిన ఉద్యోగాలు 3 లక్షలకు పైగా. 2.6 లక్షల మంది వాలంటీర్లు. ఎండీయూ వాహనాల ద్వారా 20 మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్. అధికారంలోకి వస్తే జీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తెస్తామన్నారు. అదీ మోసం. ఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి.
అడిగితే తోకలు కట్. అక్రమ కేసులు. చివరకు గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏప్రిల్ నుంచి దాదాపు రూ.1000
కోట్లు బకాయి.అప్పుల కుప్ప. దా ‘రుణ’ స్థితి చంద్రబాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. కానీ, ఒక్క పథకం అమలు లేదు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు.
అప్పుడు రెండేళ్లు కరోనా ఉంది. అయినా అన్ని పథకాలు ఇచ్చాం. అంటే మా 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 52.34 శాతం 14 నెలల్లోనే చేశాడు. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఎవరికి మంచి చేయలేదు. పథకాల అమలు లేదు.
అయినా ఎవరూ అడగొద్దు. రూ.18,272 కోట్ల బాదుడు విద్యుత్ ఛార్జీల రూపంలో భారం వేశారు. ఫ్యుయెల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్
(ఎఫ్పీపీసీఏ) పేరుతో దోపిడి.
ఎవ్వరూ ప్రశ్నించొద్దు
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అమ్మకం, మట్టి మాఫియా, ఇసుక స్కామ్.. దేని గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇక్కడ నిర్మాణ వ్యయం పెంచారు. ప్రతి అడుగుకు దాదాపు రూ.10 వేలు చెల్లింపు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం కమిషన్
తీసుకుంటున్నారు.
ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు. ఎక్కువ ధరకు పీపీఏ చేసుకున్నా అడగొద్దు. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి. అయినా ఎవరూ ప్రశ్నించొద్దు.
వడ్డీతో సహా చెల్లిస్తాం
ఒకటే చెబుతున్నా. ప్రజలతో ఉంటాం. వారి కోసం పోరాడుతాం. కేసులకు భయపడం.చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారికి ఒకే హెచ్చరిక. ఎవరినీ వదలం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మరో మూడేళ్లు గడిస్తే, మా ప్రభుత్వం వస్తుంది.
ఇండోసోల్ను తరిమేసే కుట్ర
ప్రకాశం జిల్లాలో ఇండోసోల్కు భూమి ఇచ్చాం. వారు రైతులకు డబ్బులిచ్చారు. 8 వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ, వారిని వెళ్లిపొమ్మంటున్నారు. ఆ భూములు వేరే వారికి ఇచ్చేలా, ఇండోసోల్ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు.
అక్కడ రైతులు రెండు పంటలు పండే భూములు ఇవ్వబోమంటున్నారు. ఆ కంపెనీ రూ.42 వేల కోట్లు పెట్టుబడి. మరి మీరు కంపెనీలు రావాలనుకుంటున్నారా? అదే బీపీసీఎల్కు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే, ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఇవ్వొచ్చు కదా? వారికి ఇండోసోల్ కంపెనీ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? పరిశ్రమల ఏర్పాటు కాదు చంద్రబాబు లక్ష్యం. వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం. జిందాల్ వాళ్లు వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు దండం పెడుతున్నారని వైయస్ జగన్ చెప్పారు.