Home » మీ నుంచి మర్యాద, నిజాయితీ ఆశిస్తున్నాం

మీ నుంచి మర్యాద, నిజాయితీ ఆశిస్తున్నాం

జైరాం రమేశ్‌ పోస్టుపై లోకేశ్‌ ఘాటు స్పందన

అమరావతి: జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్‌ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారు. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, షేర్‌ చేసిన ఫొటోలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మీరు వ్యక్తపరిచినట్టు మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అని ‘ఎక్స్‌’లో లోకేశ్‌ సమాధానమిచ్చారు.

Leave a Reply