– లోకేశ్ బాబు వైసీపీ నాయకులకు సింహస్వప్నమయ్యాడు
– సూళ్లూరుపేట నియోజకవర్గం యువగళం క్యాంప్ సైట్ నుండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
లోకేశ్ బాబు వైసీపీ నాయకులకు సింహస్వప్నంలా తయారయ్యాడు. వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదు. జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ నాయకులు జడసుకుంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేశ్ ను పప్పు అన్నారు. లోకేశ్ పప్పు కాదు దుర్మార్గులపాలిట నిప్పు అని రుజువు చేసుకున్నారు. రాయలసీమలో ముగ్గురు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలున్నారు, లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవుతుందని కారుకూతలు కూశారు.
పాదయాత్రను రాయలసీమలో ఘనంగా విజయవంతం చేశారు. రాయలసీమ వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాడు. రాయలసీమలో పోలీసుల పప్పులేం ఉడకలేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వారానికి నాలుగు రోజులు విహార యాత్రలా సాగింది. రోజుకు పది కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేశాడు. జగన్ వారానికి 40 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తే.. లోకేశ్ వారానికి వంద కిలోమీటర్లు చేస్తున్నాడు. లోకేశ్ మీలా పీ.కే.లను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయలేదు. లోకేశ్ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుకుకుంటున్నాడు.
నెల్లూరు బ్యారేజ్ ను టీడీపీ 90 శాతం చేసి 10 శాతం వైసీపీ చేతిలో పెడితే ఆ 10 శాతం పని పూర్తి చేయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టింది. సంగం బ్యారేజ్ 70శాతం టీడీపీ చేసి వైసీపీ చేతికిస్తే ఆ 30 శాతం పనులు చేయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టింది. ఎస్ ఎస్ కెనాల్ ఫారెస్టు క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే వైసీపీ 250కోట్లకు టెండర్స్ పిలిపించి 15 శాతం పని జరిగాక రివర్స్ టెండర్ పేరుతో పనులను మూలన పడేశారు.
నెల్లూరు సిటీలో భూగర్భ డ్రైనేజ్ పనులు 11 వందల కోట్లతో టీడీపీ ప్రభుత్వం వెయ్యి కోట్లతో పనులు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం వంద కోట్ల పని చేయలేకపోయింది. మేం నెల్లూరు సిటీలో రూ.4,500 కోట్లతో రోడ్లు ఇతర పనులు చేశాం. ఈ 4 సంవత్సరాల 2 నెలల్లో మీరెంత ఖర్చు చేశారో తెలపాలి. ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కు టీడీపీ ఎంత ఖర్చు చేసింది.. మీరెంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
టీడీపీ ప్రభుత్వం రూ.60వేల కోట్లు ఖర్చుపెడితే వైసీపీ ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నీటిపాదరుదల శాఖను పడుకోబెట్టారు. వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసిన మీరా లోకేశ్ బాబు గురించి మట్లాడేది. వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో కొట్టుకచస్తున్నారు. ఆ ఫ్రస్టేషన్ తెలుగుదేశం నాయకులపై చూపొద్దు.
జగన్ గ్రాఫిక్ చేసినట్లు లోకేశ్ చేయటంలేదు. ప్రతి సభలోనూ జనం తండోపతండాలుగా వస్తున్నారు. యువగళానికి వచ్చే ప్రజలను లోకేశ్ ఎంతో ఆదరిస్తున్నాడు. జగన్ పాదయాత్ర అంతా ఫ్యాషన్ షో. రాయలసీమలో లోకేశ్ చేసింది సాహసయాత్ర. లోకేశ్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కారుకూతలు కూస్తున్నాడు. లోకేశ్ అమెరికాలో చదివిన విద్యావంతుడు.
ఒక ముఖ్యమంత్రికి మనవడు. ఒక ముఖ్యమంత్రికి కొడుకు. మంత్రిగా పనిచేశారు. ఐటీ పెట్టుబడులు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కంపెనీలను తరిమేశారు. వైసీపీ నాయకులు నడిచే సిమెంటు రోడ్లు మొదలుకొని గ్రామాల్లోని ఎల్ ఈడీ బల్బుల వరకు లోకేశ్ ఒక మార్క్ వేసుకున్నాడు. వైసీపీ నాయకులు గ్రామాలలో స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోలేకపోయారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులన్నా, సిమెంటు రోడ్లన్నా లోకేశ్ గుర్తుకొస్తాడు.
లోకేశ్ టీడీపీ హయాంలో పేదలకు అనేక మరుగుదొడ్లు కట్టించారు. ఐటీ ని డెవలప్ చేశారు. అది లోకేశ్ బ్రాండ్. హెయిర్ వాట్ టెక్నాలజీతో నెల్లూరులో టీడీపీ ప్రభుత్వం 17 వేల ఇళ్లు రెడీ చేస్తే.. నాలుగున్నర సంవత్సరాల్లో పేదలకు ఆ ఇళ్లను ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు. వెంకటేశ్వరపురం, కొండ్లపుడి, అల్లీపురంలలో టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి. ప్రైవేటు ఆపార్టుమెంట్లలాగ కట్టిస్తే పేదలకు ఇవ్వడానికి వైసీపీకి మనసు రాలేదు.
నెల్లూరు కార్పొరేషన్ లో మేం ఏం చేశాం, మీరేం చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలి. రాష్ట్రంలో ఇరిగేషన్ కు మేం ఎంత ఖర్చు చేశాం, మీరెంత ఖర్చు చేశారో బయటికి తీయాలి. అధికారంలో ఉన్నవారికి ఇదేం పెద్ద పనికాదు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చేతులు తడిపితే మాత్రమే ఇరిగేషన్ నుండి బిల్లులు వస్తున్నాయి. ఒక పెద్ద కాంట్రాక్టర్ ఒక మీడియేటర్ ను ఆశ్రయిస్తే తెలుగుదేశం టైంలో ఆగిపోయిన బిల్లు 30 శాతం లంచం తీసుకుని రిలీజ్ చేసినట్లు తెలిసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.