Suryaa.co.in

Andhra Pradesh

సూపర్‌సిక్స్ హామీలు ఏమాయె?

-ఏపీకి మోదీ ఇచ్చిన హామీలు మరిచారు
-లోకేష్‌కు పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ట్వీట్

విజయవాడ: ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల సంగతి ఏమయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.

సూప‌ర్ సిక్స్ హామీల విష‌య‌మై ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. 22 లోక్‌స‌భ సీట్ల‌కు గాను 21 సీట్లు గెలిచి ప్ర‌ధాని మోదీకి ఇచ్చిన హామీని నెర‌వేర్చినందుకు గ‌ర్వంగా ఉంద‌న్న మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్య‌ల‌కు స్పందించిన షర్మిల.. ఆయనకు అదే ఎక్స్ ద్వారా ప్రశ్నలు సంధించారు.

‘‘ ప్ర‌ధాని మోదీ హామీ నెర‌వేర్చామ‌న్న మీరు ఏపీ ప్ర‌జ‌ల‌కు నెర‌వేర్చ‌ని హామీల గురించి ఎందుకు మాట్లాడ‌టం లేదు? ఫ్రాంక్లీ స్పీకింగ్ టీవీ షోలో మిమ్మ‌ల్ని చూడ‌డం చాలా బాగుంది . కానీ ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మీరు ఇచ్చిన హామీల‌పై మీ ఉద్దేశం ఏంటో స్ప‌ష్టంగా చెప్పా లి. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై 4 నెల‌లు గ‌డుస్తున్నా, ఇప్ప‌టికీ మీ సూప‌ర్ సిక్స్ హామీలు నెర‌వేర‌లేదు .

సీఎం చంద్ర‌బాబు ప్ర‌తివారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి ప‌రుగులు పెడుతున్న‌ప్ప‌టికీ ఒరిగిందేమీ లేదు. రాష్ట్రానికి ప్ర‌ధాని ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా నెర‌వేర‌లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు, విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్‌ల‌కు దిక్కులేకుండా పోయింది . వాటి పురోగ‌తి ప‌నుల‌పై మంత్రి లోకేశ్ స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది’’ అని ష‌ర్మిల ఎక్స్ ద్వారా ప్రశ్నలు సంధించారు.

LEAVE A RESPONSE