– తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు
చీరాలలో పార్టీలో ఎవరు చేరిన ఇంతకముందు గత నియోజకవర్గ ఇంచార్జ్తో కలిసి పనిచేయాలని తెదేపా అధినేత, నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.నియోజకవర్గాల వారిగా పార్టీ ఇంచార్జ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారిగా పార్టీ ఇంచార్జ్లతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖీ భేటీలు నిర్వహిస్తున్నారు.
అయితే నిన్న రాజమండ్రి, పెదకూరపాడు, మంత్రాలయం, చీరాల, కోడుమూరు, కనిగిరి ఇంచార్జ్లతో సమీక్ష నిర్వహించారు.బాపట్ల జిల్లా చీరాలలో ఇతర పార్టీల నేతలు తెదేపాలో చేరికలపై.. జరుగుతున్న ప్రచారాన్ని ఇంచార్జ్ ఎంఎం కొండయ్య సమీక్ష సమావేశంలో చంద్రబాబుకు వివరించారు. పార్టీ ఇంచార్జ్గా కొండయ్యను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరు చేరినా.. కొండయ్యతో కలిసి పని చెయ్యాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు.
ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని.. వారికే టిక్కెట్లు ఇవ్వడం అనే చర్చను చంద్రబాబు కొట్టిపారేశారు.పార్టీకి మెరుగైన సేవలను అందించాలని కొండయ్యకు సూచించారు. యర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గా ఎరిక్షన్ బాబు ఉంటారని స్పష్టం చేసిన చంద్రబాబు. ఎరిక్షన్ బాబుకు సహకరించాలని మన్నె రవీంద్రకు చెప్పిన చంద్రబాబు.పార్టీలో అందరినీ కలుపుకుని పని చేయాలని ఎరిక్షన్ బాబుకు చంద్రబాబు సూచన.